కిడ్నీల్లో రాళ్లు

కిడ్నీ (మూత్రిపండాలు) ల్లో రాళ్లు ఏర్పడినట్లు అప్పుడప్పుడు వింటుంటాం.కిడ్నీల్లోనే గాక కాలేయంలో, పిత్తాశయంలో కూడా రాళ్లు ఏర్పడవచ్చు.ఇవి మనం ఆహారంలో పొరపాటున తీసుకునే రాళ్లు కావు, శరీరంలో కొన్నిరకాల ఆసిడ్స్‌ (ఆమ్లాలు), ఇతర పదార్థాల వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్న గుండుసూది తల నుండి కోడిగుడ్డు సైజు వరకు రకరకాల సైజుల్లో వుంటాయి. వైద్యపరిభాషలో ఈ రాళ్లను కాలిక్యులైఅంటారు.

ఈ రాళ్లు మూత్రవాహికలో ఇన్‌ఫెక్షన్లు వున్నప్పుడు, మూత్రం నిల్వ వుండిపోయినప్పుడు, తగినంత నీరు తాగకపోవడం, ఆసిడ్‌ కలుగ జేసేపదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడతాయి.
మూత్రంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా వుంటే సోడియం యూరేట్‌, యూరిక్‌ ఆసిడ్‌, ఫాస్పేటులు గల రాళ్లు ఏర్పడతాయి.  మూత్రంలో క్షార గుణం వుంటే కాల్షియం ఫాస్పేటు, అమోనియం యూరేట్‌, మెగ్నీషియం, ఫాస్పేటులతో కూడిన రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడినపుడు తీవ్రంగా కడుపునొప్పి వస్తుంటుంది. వివిధ రసాయనాలతో పాటు చెడు బ్యాక్టీరియా, ఎపితీలియల్‌, చీముకణాలు రాళ్లను మరింత దృఢతరం చేస్తాయి.

Related

health articles 7643592997860007567

Post a Comment

emo-but-icon

Hot in week

Recent

4/comments/show

Comments

Side Ads

Text Widget

Connect Us

item