షుగర్ వ్యాధి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే...

ApurupA
0


ఒక్కసారి మధుమేహం వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఎంత తినాలి? వంటి విషయాలన్నో పరిగణనలోకి తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని అదుపులో ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.

  • మధుమేహంతో బాధపడే వాళ్లు యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే డయాబెటిక్ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 
  • వాటి ద్వారా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా అందాల్సి ఉంటుంది. 
  • ఒకవేళ ఉదయం ఆలస్యంగా నిద్ర లేచినా, ఖాళీ కడుపుతో అలాగే ఉండకుండా ప్రొటన్లు ఎక్కువగా లభించే కోడిగుడ్డులోని తెల్లసొన భాగాన్ని ఉడికించి తీసుకోవచ్చు.
  • స్కిమ్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న బోజనాన్ని సాధ్యమైనంత వరకు పన్నెండు గంటల కల్ల పూర్తి చేసేయండి.
  •  మీ ఆహారంలో ఎక్కువగా తాజా ఆకుకూరలు, పసుపు, కాషాయం రంగు పండ్లు ఉండేల చూసుకోండి. వీటిని తీసుకునే ముందు ఓ సారి నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది.
  • కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వండి. 
  • ఒక సారి పోషకాహార నిపుణులను సంప్రదిస్తే ఏ సమయంలో ఏది తినాలనే ఆహార ప్రణళిక (డైట్చార్ట్) సిద్ధం చేస్తారు. 
దాన్ని ఫాలో అయితే షుగర్ వ్యాధి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top