ఈ ఆసనాలతో సూర్యుడిని ఆరాధిస్తారు. ఇందులో రకర కాల భంగిమలలో ఆసనాలు వేస్తారు. దీనితో శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది. ఇందులో ఆసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం అన్నీ ఇమిడి ఉంటాయి. సూర్యనమస్కారాలు ఖాళీకడుపుతో మాత్రమేవేయాలి. ఒకవేళ ఏదైనా తినేసి ఉంటే, తిన్న రెండుగంటల తర్వాత మాత్రమే వేయాలి. సర్వసాధారణంగా ఈ ఆసనాలు ఉదయమే అల్పాహారం కూడా తీసుకో కుండా వేస్తారు. పన్నెండు ఆసనాలు కలిస్తే ఒక సూర్యనమస్కారం పూర్తయినట్టు. ఈ పన్నెండు ఆసనాలను సుమారు పది సార్లు వేస్తే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవి వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భంగిమకు తగట్టుగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఉంటుంది.
పన్నెండు భంగిమలకు పన్నెండు మంత్రాలు ఉంటాయి.
- ఓం మిత్రాయ నమః అంటూ ప్రణామాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
- ఓం రవయే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి.
- ఓం సూర్యాయ నమః అంటూ హస్తపాదాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
- ఓం భానవే నమః అంటూ ఏకపాదాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి.
- ఖగాయ నమః అంటూ అధోముఖ శవాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
- ఓం పూష్ణే నమః అంటూ అష్టాంగ నమస్కార ఆసనం వేస్తూ శ్వాస బిగపట్టాలి.
- ఓం హిరణ్యగర్భాయనమః అంటూ భుజంగా సనం వేస్తూ, శ్వాస తీసుకోవాలి.
- ఓం మరీచాయ నమః అంటూ అధోముఖ శ్వానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి.
- ఓం ఆదిత్యాయ నమః అంటూ అశ్వసంచలనాస నం వేసి శ్వాస తీసుకోవాలి.
- ఓం సవిత్రే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి.
- ఓం అర్కాయ నమః అంటూ హస్త ఉత్థానాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
- ఓం భాస్కరాయ నమః అంటూ ప్రణామాసనం వేస్తూ, శ్వాస విడిచిపెట్టాలి.
చిట్టచివరగా ఓం శ్రీసవిత్రసూర్యనారాయణ నమః ఓం మాతా పితృభ్యామ్ నమో నమః అని పూర్తిచేసి సుమారు పదినిముషాల పాటు శవాసనం వేయాలి.
ఇందులో ఉచ్చరించే మంత్రాల కారణంగా ఊపిరి తిత్తులు శుభ్రపడతాయి. ఒక్కో భంగిమ శరీరంలోని ఒక్కో భాగానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. లేత ఎండలో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఈ ఆసనాలు వేయడం ద్వారా సూర్యుని నుంచి విటమిన్ ఏ లభించడమే కాకుండా, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శరీరంలో ఉండే అనాహత, విశుద్ధి, స్వాధిష్ఠాన, ఆజ్ఞా, మణిపూర...చక్రాలు పరిశుభ్రమవుతాయి. సూర్యనమస్కారాలు వేయడం ద్వారా, సూర్యునిలాగే ప్రకాశవంతంగా వెలగడానికి అవకాశం ఉంటుంది. ఎంత డైటింగ్ చేసినా తగ్గని శరీర బరువును కేవలం సూర్య నమస్కారాల ద్వారా తగ్గించుకోవచ్చని యోగానిపుణులు చెబుతున్నారు.